టైర్ల తయారీ సంస్థ సియట్.. టాలీవుడ్ నటుడు రానా దగ్గుపాటిని ప్రచారకర్తగా నియమించుకుంది. పంక్చర్ సేఫ్ శ్రేణి బైక్ టైర్లకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు రానా ప్రచారం చేయనున్నారు. ఇందులో భాగంగానే ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో సమగ్రమైన మార్కెటింగ్ క్యాంపెయిన్ నిర్వహించేందుకు రానా దగ్గుపాటితో వాణిజ్య ప్రకటనను రూపొందించినట్లు సియట్ తెలిపింది.
