ఎన్టీఆర్‌ సేవాసమితి కువైట్‌ ఆధ్వర్యంలో పసుపు కుంకుమ కార్యక్రమం..

N

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తొగుదేశం పార్టీ అధ్యక్షుడు నారాచంద్రబాబునాయుడు స్ఫూర్తితో… ఎన్టీఆర్‌ సేవాసమితి కువైట్‌ అధ్యక్షుడు చుండు బారెడ్డయ్య ఆధ్వర్యంలో టి.డి.పి కువైట్‌ వారి సహకారంతో కువైట్లో భారీగా పసుపు కుంకుమ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొగింటి ఆడపడుచుకు చీర మరియు పసుపు కుంకుమను అందజేశారు.అధ్యక్షుడు చుండు బా రెడ్డయ్య నాయుడు, షేక్‌ సుబాన్‌, గుదె నాగార్జున, ఆంజనరెడ్డి, ఏనుగోండ నరసింహ నాయుడు, షేక్‌ హ బీబ్‌ ఆధ్వర్యంలో హవల్లి ప్రాంతం నుంచి మెదుపెట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావు గారు మరియు చంద్రబాబు ఆశయ సాధన కోసం నిరంతరం పనిచేస్తామన్నారు. ఆడపడుచును పసువు కుంకమ కార్యక్రమం క్రింద గౌరవించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మద్దిన ఈశ్వర్‌ నాయుడు, ఈడుపుగంటి ప్రసాద్‌, విక్రమ్‌ ఆంజి తదితయి పాల్గొన్నారు.

Share: