టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన అమరరాజా ఇన్ఫ్రాటెక్ (ప్రైవేట్) సంస్థకు మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో కేటాయించిన 253.6 ఎకరాల్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ మేరకు ఏపీఐఐసీకి అనుమతిస్తూ ఉత్తర్వు జారీ చేసింది. వైఎస్ ప్రభుత్వ హయాంలో (2009) చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం, యాదమర్రి మండలాల్లోని నూనెగుండ్లపల్లి, 108-మహారాజా కొత్తపల్లి గ్రామా పరిధిలో అమరరాజా కంపెనీకి మొత్తం 483.27 ఎకరాను ఏపీఐఐసీ కేటాయించింది. ‘ఆ సంస్థ (అమరరాజా ఇన్ఫ్రాటెక్) భూము తీసుకుని పదేళ్లవుతున్నా… ఒప్పందం ప్రకారం మొత్తం భూమిని వినియోగంలోకి తీసుకు రాలేదు. 253.6 ఎకరాు ఖాళీగా ఉంచేసింది. ఆ భూముల్లో ప్రత్యేక ఆర్థిక మండలి(ఎస్ఈజెడ్)ని ఏర్పాటు చేస్తామని, డిజిటల్ వరల్డ్ సిటీని అభివృద్ధి చేస్తామని చెప్పింది. రూ.2,100 కోట్ల పెట్టుబడు పెడతామని, 20 వే మందికి ఉపాధి కల్పిస్తామని ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదు. 4,310 మందికి మాత్రమే
ఉపాధి కల్పించింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న భూమి మివ రూ.60 కోట్లకుపైగా ఉంటుంది. ఆ సంస్థ అంత మివైన ప్రజ ఆస్తిని ఖాళీగా వదిలేయడం ఒప్పందంలో చేసుకున్న నిబంధనల్ని
ఉ్లంఘించడమే కాకుండా, ప్రజా ప్రయోజనాకూ విరుద్ధం.
నిబంధన ప్రకారం కంపెనీ ఏ అవసరం కోసం తీసుకుంటే అందుకు రెండేళ్లలోగా ఆ భూముల్ని వినియోగించాలి. లేని పక్షంలో ప్రభుత్వం భూము వెనక్కు తీసుకోవచ్చు’’ అని పరిశ్రమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలెవన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
భూము కేటాయింపు జరిగిందిలా..
తిరుపతి సమీపంలోని కరకంబాడి వద్ద అమరరాజా బ్యాటరీస్కు అతిపెద్ద బ్యాటరీ ప్లాంటు ఉంది. దీనికి అనుబంధంగా కంపెనీ ఛైర్మన్ గల్లా రామచంద్ర నాయుడు స్వగ్రామం పేటమిట్టతో పాటు ఆయన సతీమణి గల్లా అరుణ కుమారి స్వగ్రామం దిగువమాఘంలో మహిళ కోసం ప్రత్యేకంగా మరో కంపెనీ ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో మరిన్ని పరిశ్రము ఏర్పాటు చేయాని గల్లా రామచంద్ర నాయుడుకు వైఎస్ రాజశేఖరరెడ్డి ఓ కార్యక్రమంలో సూచించారు. భూము సేకరణ, ఖరీదు దృష్ట్యా విస్తరణ అంత సుభం కాదనే అభిప్రాయం వైఎస్ రాజశేఖరరెడ్డి వద్ద ఆయన వ్యక్తం చేశారు. జిల్లాలో కోరుకున్న చోట భూము కేటాయిస్తామంటూ చిత్తూరు సమీపంలో సీఎంసీ ఆసుపత్రికి కేటాయించిన భూమును మొదట ప్రతిపాదించారు. చదునైన వ్యవసాయ భూము తీసుకోవడం భావ్యం కాదనే అభిప్రాయంతో యాదమరి, బంగారుపాళ్యం మండలా సరిహద్దులోని నూనెగుండ్లపల్లె సమీపంలో కొండ ప్రాంతాను ఎంచుకున్నారు. ఇక్కడి భూము కేటాయింపునకు వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవ తీసుకుని అప్పటి పరిశ్రమశాఖ మంత్రి గీతారెడ్డికి సూచను చేసి సజావుగా కేటాయింపు ప్రక్రియ సాగేలా చర్యు తీసుకున్నారు. ఈ మేరకు అటు ప్రభుత్వం తరఫున ఏపీఐఐసీకి… ఇటు రైతుకు వేర్వేరుగా డబ్బు చెల్లించి కంపెనీ భూమును స్వాధీనం చేసుకుంది.
అమరరాజా గ్రోత్ కారిడార్ ఏర్పాటు
ప్రభుత్వం కేటాయించిన 483.27 ఎకరా చుట్టూ భారీ ప్రహరీ నిర్మించి అమరరాజా గ్రోత్ కారిడార్ పేరిట ప్రత్యేక ఆర్థిక మండలిని (ఎస్ఈజెడ్), గ్రీన్జోన్ను సంస్థ అభివృద్ధి చేసింది. ఇందులో రూ.700 కోట్లు వెచ్చించి ఆటోమోటివ్ బ్యాటరీ తయారీ ప్లాంట్ను నెకొల్పింది. ప్లాంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 65 క్ష యూనిట్లు. దశ వారీగా ప్లాంట్ను విస్తరించడం ద్వారా ఉత్పత్తిని 1.08 కోట్ల యూనిట్లకు చేర్చి దేశంలో అతిపెద్ద ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దానే క్ష్యంతో కంపెనీ విస్తరణ పను చేపట్టింది.
పల్లె ప్రాంత యువతకు పెద్ద పీట
అమరరాజా సంస్థ గ్రామీణ ప్రాంతాల్లోనే పరిశ్రమను ఏర్పాటు చేయడంతో పాటు పల్లె ప్రాంతా యువతకు ప్రత్యక్షంగా 16వే మందికి, పరోక్షంగా మరో 10వే మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.
అమరరాజా సంస్థకు గతంలో చేసిన భూకేటాయింపుల్ని ఈ ప్రభుత్వం రద్దు చేయడం రాజకీయ కక్ష సాధింపులో భాగమే. భూము తీసుకుని పరిశ్రము పెట్టనివాళ్లను ప్రభుత్వం వదిలేసింది. పరిశ్రమను సగం అభివృద్ధి చేసి, మిగతా సగం అభివృద్ధికి సిద్ధమైన వాళ్లను వేధిస్తోంది. పాకుకు ప్రతీకారం ఉండకూడదు.
జయదేవ్పై కక్షతోనే : చంద్రబాబు
అమరరాజా సంస్థకు గతంలో చేసిన భూకేటాయింపుల్ని ఈ ప్రభుత్వం రద్దు చేయడం రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ జయదేవ్పై అక్కసుతోనే భూముల్ని ప్రభుత్వం వెనక్కు తీసుకుంటోందని ఆయన మండిపడ్డారు. ‘అమరరాజా గ్రూప్ సంస్థ అధినేత గల్లా రామచంద్ర నాయుడు’ రాష్ట్రంలోనే అత్యధిక పన్ను చెల్లించే పారిశ్రామికవేత్త. పారిశ్రామిక రంగంలో ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ చిత్రపటంలో ఉంచాన్న క్ష్యంతో… ఆయన విదేశా నుంచి వచ్చి ఇక్కడ అమరరాజా యూనిట్ స్థాపించారు. అలాంటి పారిశ్రామికవేత్తకూ వైకాపా మోకాడ్డటం గర్హనీయం. వెనుకబడిన చిత్తూరు జిల్లా పశ్చిమ ప్రాంతం అభివృద్ధికి, యువత ఉపాధి క్పనకు అమరరాజా పరిశ్రము ఎంతో తోడ్పడ్డాయి. బంగారుపాళ్యం భూముల్లో ఆ సంస్థ ఇప్పటికే యూనిట్ నెకొల్పింది. ఇలాంటి తరుణంలో భూ కేటాయింపు రద్దు చేయడం కేవం కక్ష సాధింపే’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.